నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 30 : తంబళ్లపల్లె మండలం లో రబీ పంటకు గాను 330 కే సిక్స్ రకం సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు వచ్చినట్లు గ్రామ వ్యవసాయ అధికారులు సురేష్, రెడ్డి శేఖర్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవో రమణ కుమార్ ఆదేశాల మేరకు వ్యవసాయ బోర్లు, ప్రాజెక్ట్ ఆయకట్టు లోని పాస్ బుక్ లు ఉన్న రైతులకు త్వరలో పంపిణీ చేపడతామని చెప్పారు. రబీలో ఆరుతడి పంటల సాగు చేసే రైతులు సబ్సిడీ విత్తనాల కోసం మంగళవారం నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
Reporter
Namitha News