నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 07 : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం లోని గ్రామీణ ప్రజలు, యువకులు, విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గుర్రంకొండ మండలం పిల్లగోగులవారిపల్లి, ఇరగన్నగారిపల్లి, బోడిగుట్ట గ్రామాల్లో సైబర్ క్రైమ్, వాట్సాప్ లింకులు, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొబైల్ అప్స్ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పారు. ప్రజలు సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు
Reporter
Namitha News