నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : "నమ్మి ఓట్లేశాం నట్టేట ముంచకండి" నాగినేని గోవిందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. వాల్మీకి బోయలు కు ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తుచేశారు. గిరిజనుల రిజర్వేషన్ విషయంలో ఏ జాతికి లేని ఈ అశాస్త్రీయమైన నిబంధన వాల్మీకి బోయలు రిజర్వేషన్ లో మాత్రమే ఎందుకు ? రాజ్యాంగాన్ని అనుసరించి అధికరణ 14.15.16. 29/1 342 లను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు.. ఆంధ్రప్రదేశ్ లోని 28 రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు SC. ST. లుగా కొనసాగుతున్నరని కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే BC-A లుగా కొనసాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో ST లుగా మైదాన ప్రాంతాల్లో BC లుగా కొనసాగు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా మామధ్య వున్న ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి " ఒకే జాతి ఒకే రిజర్వేషన్" ST రిజర్వేషన్ కల్పించాలని కొనియాడారు..లేని యెడల క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యువతను చైతన్యం చేస్తూ ఉద్యమాలను ఉదృతం చేస్తామని తెలియచేశారు
Reporter
Namitha News