నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం ఉపేక్షించకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మదనపల్లి డీఎస్పీ యస్. మహేంద్ర పోలీస్ అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సోమవారం మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో డీఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విని, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చట్ట పరిధిలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
Admin
Namitha News