నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 15 : మదనపల్లెలో సోమవారం జరిగిన దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వాహనాలలో తరలి వెళ్లారు.తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బిజెపి, కూటమి నాయకులు తరలి వెళ్లారు. రాష్ట్రస్థాయిసీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి వందలాది వాహనాలలో మదనపల్లికు కార్యకర్తలు తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో మరియు బిజెపి మహిళా నేత పీట్లఅంజలి రాజనాల సారధ్యంలో యువత, మహిళలు వాజ్ పాయ్ విగ్రహావిష్కరణతో పాటు బహిరంగ సభకు తరలి వెళ్లారు. తంబళ్లపల్లె నుండి బిజెపి నాయకులు రామస్వామి రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, రాఘవరెడ్డి, సుబ్బయ్య, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, యుగంధర్, కొటాల మల్లికార్జున, బిజెపి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News