నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : విద్యార్థులు ప్రతిరోజు పాలు తోబాటు పాల ఉత్పత్తులు తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందగలరని శ్రీజ మరియు జైకా ప్రతినిధులు బాలకృష్ణ, చిట్టిబాబు, పి ఐ బి మనోజ్ కుమార్ సూచించారు. బుధవారం కస్తూరిబా బాలికల గురుకులంలో శ్రీజ, జై కా వారి సహకారంతో పాలు, పాల ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం జరిగింది.బాలికలకు ప్రతిరోజు పాలు తాగడం వల్ల ఒరిగే ప్రయోజనాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ శ్రీమతి,పీఈటి హంస వేణి, లక్ష్మీదేవి, మరియు రాణి విద్యార్థులు శ్రీజ, జై కా ప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
Namitha News