నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి బైపాస్ రోడ్డు లో నున్న కంపోస్ట్ యార్డ్ లో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా మంజూరైన 6.4 కోట్ల రూపాయల నిధులతో తడి చెత్త- పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ బిల్డింగులు నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మన ఇళ్లలో, పరిశ్రమల్లో, మార్కెట్లలో, ఆసుపత్రుల్లో మరియు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా సేకరించడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం మరియు పర్యావరణానికి హాని కలగకుండా పారవేయడం. జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు వినియోగపు అలవాట్ల మార్పుల వల్ల ఘన వ్యర్థాల పరిమాణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యను సమర్థంగా నిర్వహించడం సమాజ ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరం అంటూ వేరు చేసి శుద్ధి చేయడం అనేది ఆరోగ్యకరమైన సమాజం మరియు పరిశుభ్రమైన పర్యావరణానికి అత్యవసరం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి వ్యర్థాల నిర్వహణలో భాగస్వాములు కావాలి. “స్వచ్ఛమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన జీవితం” అనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలని తెలియచేసారు
Reporter
Namitha News