నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఎంబిఏ డిపార్ట్మెంట్ లో ఆర్థిక జ్ఞానం (Financial Wisdom) ఫై అవగాహనా సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఆర్థిక జ్ఞానం ఫై రెండు రోజుల అవగాహనా సదస్సు నవంబర్ 17, 18 తేదీ లలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఫైనాన్సియల్ మార్కెటింగ్ అంశాలలో ఇప్పుడున్న డిజిటల్ పరిజ్ఞానానికి దీటుగా విద్య మరియు ఉద్యోగ ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్ ఐ ఎస్ ఎం (NISM) తిరుపతి రిసోర్స్ పర్సన్ డా. జె. మూర్తి, మాట్లాడుతూ ఫైనాన్సియల్ మార్కెట్స్ లో విద్యార్థులు పెట్టుబడులు వాటికీ సంబందించిన కీలక అంశాలఫై పట్టు సాధిస్తే భవిష్యత్ లో ఉద్యోగం లో ప్రధమ స్థాయిలో రాగలరని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ ఆర్థిక పరిజ్ఞానం అనేది ఫైనాన్సియల్ మార్కెటింగ్ లో అపరిమితంగా ఉంటుందని అవగాహనా చాలా అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, ఎన్ ఐ ఎస్ ఎం, రిసోర్స్ పర్సన్ డా. జే. మూర్తి, డీన్.డా. శంకర్ నాయక్, హెస్ ఓ డి. డా. జి. ఎల్. మీనాజ్, అధ్యాపకులు, ఎం బి ఏ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News