నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 27 : మదనపల్లి జిల్లా ప్రకటించ నున్న నేపథ్యంలో గుఱ్ఱంకొండ లోని ఎన్.డి.ఏ. కూటమి నాయకులు తమ గ్రామ దేవత సత్యమ్మ గుడి దగ్గర కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో గుఱ్ఱంకొండ మండల బిజెపి అధ్యక్షలు రామాంజులు మాట్లాడుతూ గత ఎలక్షన్ ముందు మదనపల్లి జిల్లా చేస్తాము అనీ మాట చెప్పిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ను ఇస్తూ మా పీలేరు ను రెవిన్యూ డివిజన్ కేంద్రం గా చేయడంలో కీలక భూమిక వహించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి కూటమి నాయకులు అందరూ ధన్యవాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర శేఖర్, శ్రీనివాస్, గోపాలరెడ్డి, మల్లికార్జున స్వామి, శేఖర్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, కళ్యాణ్ తదితర నాయకులు పాల్గున్నారు
Reporter
Namitha News