నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 23 : భారతదేశ స్వాతంత్ర సమరయోధులు,బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అమరజీవి, విప్లవ కిశోరం భగత్ సింగ్ గారి 95 వ వర్ధంతిని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీ.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏడు గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కాగడాల ప్రదర్శన చేపట్టి ఘనంగా నివాళులర్పించారు. నూనుగు మీసాల వయసులో ఉరికంబాన్ని ఎక్కిన భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు జోహార్లుఅంటూ,అమరవీరుల ఆశయాలు సాధిస్తామంటూ,ఇంక్వీ లాబ్ జిందాబాద్,విప్లవం వర్ధిల్లాలని,సామ్రాజ్యవాదం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లుమాట్లాడుతూ; సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా అర్పించిన దేశభక్తుడని, ఆ యొక్క మహనీయుని స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని, అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లీ,సీనియనాయకులు హెచ్.షమీవుల్లా, జీ.నారాయణస్వామి,ఖాదర్ భాషా,మనోహర్,ఎం. గంగులప్ప,రియాజ్,సుధాకర్,హబీబ్,ఏ.నారాయణస్వామి,శ్రీరాములు,గంగాద్రి,కిట్టన్న,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News