నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 18 : అన్నమయ్య జిల్లా బి కొత్తకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రి. రాయలసీమ లోనే వెనుకబడిన, మారుమూల ప్రాంతం అయిన తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పేద ప్రజలు కరోనా విపత్తు లో వీరి అక్రందనలు చవిచూసిన స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చలించి చొరవ చూపి వైసీపీ ప్రభుత్వ హయాం లో కోవిడ్ సమయం లో 70 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిధులు వెచ్చించి కోవిడ్ బాధితులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ టెక్నీషియన్ లేని కారణంగా ప్లాంటును ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం లేదు గత 3 సంవత్సరాలు గా ఆక్సిజన్ ఉత్పత్తి కావడం లేదు ఈ ప్లాంట్ ను వినియోగం లోకి తెస్తే 4 మండలాల పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించే వీలు కలుగుతుంది. 70 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అత్యవసరం అయిన ఆక్సిజన్ ప్రజలకు అందించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు నిర్లక్షం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం దీనిపై స్పందించి అక్సిజన్ ప్లాంట్ నడిచే విధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు
Admin
Namitha News