నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : మహిళల సమస్యల పరిష్కారానికి జెండర్ రిసోర్స్ సెంటర్ ఓ పరిష్కార వేదిక కానున్నట్లు డిఆర్డిఏ పీ.డి నాగేశ్వరరావు సూచించారు. ఆయన బుధవారం ఐకెపి కార్యాలయంలో జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం గోపిదిన్ని వద్ద క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలతో ఇన్కమ్ జనరేషన్ ప్రొఫైల్ యాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై పీడి మహిళా సంఘాలకు పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ జెండర్ రీసర్చ్ సెంటర్ ద్వారా మహిళలు తమ సమస్యలతో పాటు బాల్య వివాహాల అరికట్టడం, బాలికల విద్యాభివృద్ధికి సహకరించడం, బాలికలు తమ హక్కులను కాపాడుకోవడం, మహిళా సంఘాల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. ప్రతి గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈనారి సి ఆర్ పి, ఐదు మంది ఈసీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మండలంలోని మహిళా సంఘాలు ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట డిపిఎం ధర్మరాజు, ఏపీఎం గంగాధర్, శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News