నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెంపుడు కూతురుపై: కూతురు ఉమాదేవి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: తండ్రి నాగరాజు పుంగనూరు పట్టణంలో బుధవారం మధుశ్రీ అలియాస్ హనీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుశ్రీ మాట్లాడుతూ ఉమాదేవి తనపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ఖండించారు. తాంత్రిక పూజలు చేస్తున్నానని లేనిపోని వేషాలు వేస్తున్నానని అలాగే ఉమాదేవిపై తాను లైంగిక దాడికి పాల్పడ్డానని చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని మధుశ్రీ స్పష్టం చేశారు. ఉమాదేవి కుటుంబంలోని ఆస్తి వ్యవహారాల నేపథ్యంలో తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను నిజంగానే ఉమాదేవిపై లైంగిక దాడికి పాల్పడి ఉంటే డీఎన్ఏ పరీక్షలు సహా అవసరమైన అన్ని వైద్య పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని హనీ తెలిపారు. అసత్య ప్రచారాల ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మధుశ్రీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉమాదేవి తండ్రి నాగరాజు తమ్ముడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ పెంపుడు కూతురు హనీపై ఉమాదేవి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని అన్నారు. కుటుంబ ఆస్తులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే బహిరంగంగా ఆరోపణలు చేయకుండా నేరుగా వచ్చి తమతో చర్చించాలని ఉమాదేవికి వారు కోరారు. కుటుంబ పరమైన విషయాలను అనవసరంగా బయటకు తీసుకువచ్చి వివాదాలు సృష్టించడం సరికాదని ఉమాదేవిని వారు హెచ్చరించారు
Reporter
Namitha News