నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 23 ః తంబళ్లపల్లె మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు భగవాన్ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పీ.డీ వెంకటరత్నం ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ సత్య సాయి బాబా చిత్రపటానికి పూజలు నిర్వహించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిస్వార్ధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా తాగునీరు, విద్య, వైద్యం తో పాటు నిరుపేద ప్రజలకు సేవ చేసి రాష్ట్రం తో పాటు ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయుడుగా చరిత్రలో నిలిచిపోయాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత , పుష్ప కుమారి, బాలగంగాధర్, భూదేవి,ఎఫ్ ఏ లు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News