నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : రాష్ట్ర టిడిపి ఆదేశాల మేరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, అబ్జర్వర్ దినేష్ రెడ్డి సూచనలతో మండలంలో మహానాడు కార్యక్రమాన్ని ఐకమత్యంతో విజయవంతం చేద్దామని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జరిగిన కార్యకర్తల సమీక్షలో ఆయన మాట్లాడుతూ మండలంలో రెండు క్లస్టర్లుగా రెండుచోట్ల మహానాడు జరుగుతుందని ప్రతి టిడిపి కుటుంబ సభ్యుడు హాజరుకావాలని కోరారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మండలంలో టిడిపి నాయకులు ఐకమత్యంతో కలసిమెలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు విభేదాలు మరచి కలసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు,రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, సిద్ధమ్మ, క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, కాలా నారాయణ, తెలుగు యువత నరసింహులు, పురుషోత్తం,వీరాంజనేయులు, రామచంద్ర, కసెట్టి వెంకటరమణ, నరేంద్ర, రామాంజులు,పెద్ద రెడ్డప్ప, నిజాముద్దీన్, రాజేష్, గురుమూర్తి, ఆదిరెడ్డి, శివరాం, జయరాం రెడ్డి,వెంకటరమణ, రామచంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేంద్ర నాయుడు, జగదీష్, భాస్కర్,సోమశేఖర్, సురేంద్ర, బాబ్జాన్,రామ్మోహన్, శేఖర్ రెడ్డి, ఐసుల కృష్ణ, దండువారిపల్లి రమణ, నరసింహనాయుడు, శివకృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News