నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 22 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ మట్లవారిపల్లె గ్రామ అయ్యప్ప మాలధరించిన స్వాములు శబరిమలైకు శనివారం బయలుదేరారు. 41రోజులు మండల దీక్ష చేసి స్వామి దర్శనం కోసం బయలుదేరారు. వీరికి గురుస్వామి అయ్యప్ప అయ్యప్ప స్వాములకు నియమ నిష్టలతో ఇరుముడి కట్టి సుమారు 30మంది స్వాములకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి స్వాములకు కొబ్బరికాయలో నెయ్యి, బియ్యం పూజ సామాగ్రిలు వేసి నల్లటి వస్త్రంలో ఇరుముడి కట్టి అయ్యప్ప స్వాములు శబరి మలైకి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి అయ్యప్ప మట్లవారిపల్లె, పెద్దకురప్పల్లె నడింపల్లె మిట్టపల్లె, బొంపల్లె స్వాములు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News