Sunday, 26 July 2026 09:53:39 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి

Date : 08 July 2026 04:09 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్, అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, పట్టణంలోని అన్ని కాలనీలకు అవసరమైన మేర నీటిని సమీప జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా తరలించి ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీటీఎం రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే సమీక్షించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువను సర్వే చేసి, అవసరమైన సాంకేతిక చర్యలు పూర్తి చేసిన అనంతరం రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా సంబంధిత బీఎల్‌ఓలకు అవసరమైన సూచనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో డీఈ శ్రావణి, ఏఈలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: