Monday, 27 July 2026 09:51:00 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత - టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ - ఇరువర్గాలను పంపించి వేసిన పోలీసులు

Date : 24 November 2025 07:34 AM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత - టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ - ఇరువర్గాలను పంపించి వేసిన పోలీసులు మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది.ఈ విధానాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి తీవ్రంగా విమర్శిస్తోంది.ఈ అంశంపై టిడిపి,వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పెద్దిరెడ్డి కుటుంబంపై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా పిపిపి విధానం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై క్లుప్తంగా వివరించారు.దీనిపై తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కొందరు శ్రీరామ్ చినబాబుపై సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే ఊరుకోమని అవసరమైతే కళాశాల వద్దకు కళాశాల వద్దకు వస్తామని అక్కడే తేల్చుకుందామన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అనుచరులు కొంతమంది ఆదివారం మెడికల్ కళాశాల వద్దకు చేరుకోగా విషయం తెలుసుకున్న శ్రీరామ్ చినబాబు అనుచరులు,టిడిపి శ్రేణులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో టిడిపి శ్రేణులు,వైసిపి కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.గత ఐదేళ్ల కాలంలో దాడులు,దౌర్జన్యాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ ఆరోపించారు.ఇది వైసీపీ ప్రభుత్వం కాదని,రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమని వైసిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.విషయం తెలుసుకున్న పోలీసులు మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు.టిడిపి,వైసిపీ శ్రేణులను అక్కడి నుండి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.పిపిపి విధానంపై ఆరోపణలు,ప్రతి ఆరోపణలతో వైసిపి,టిడిపి నాయకులు తీవ్రవ్యాఖ్యలు చేసుకుంటున్నారు.ఇది ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :