నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 02 : పుంగనూరు పట్టణం సమీపంలో బైపాస్ రోడ్డు లోని జె టౌన్ వద్ద క్వాలిస్ వాహనం ను డీ కొన్న ఆటో ఘటన లో ఆటో డ్రైవర్ రెడ్డెప్ప ఘటనా స్థలం లోనే మృతి చెందగా ఆటో లోని ఏడుగురి కి తీవ్ర గాయాలు. క్షత్తగాత్రులను హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా ఏడుగురి లో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంటే మెరుగైన వైద్యం కోసం తరలించిన కుటుంబీకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు. రామసముద్రం మండలం చెంబుకూరు గ్రామం దిన్నిమీద హరిజనవాడ వాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి లోని నల్లారాళ్ల గంగమ్మ గుడి లో మొక్కు తెర్చుకొని తిరిగివెళ్లే క్రమంలో ప్రమాదం జరిగిందని తెలిపిన క్షత్తగాత్రులు
Reporter
Namitha News