నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 20 : దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ లో మందుల అమ్మకాలను, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ లను, ఆన్ లైన్ లో నకిలీ మందుల విక్రయాలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం కు అఖిల భారత కేమిస్ట్ ల సమైఖ్య ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించినా సరైన పరిస్కారం చూపకపోవడం, తగు చర్యలు తీసుకోవడం లో అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో తమ నిరసన ను తెలియచేయుటకు నేడు భారతదేశం వ్యాప్తంగా మెడికల్ షాప్ లను మూసివేసి స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించాలని పిలుపుమేరకు నేడు పుంగనూరు కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణం లోనున్న 67 మెడికల్ షాప్ లను మూసివేసి స్థానిక ప్యాలస్ కాంపౌండ్ నుండీ ఆన్ లైన్ మందుల విక్రయాలను నిషేదించాలని, వాటి వల్ల ప్రజల ఆరోగ్యం సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ తో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని తెలియచేస్తూ, నినాదాలు చేసుకొంటూ పట్టణ ప్రధాన పురవీధుల మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన కెమిస్ట్ లు, మెడికల్ షాప్ యజమానులు. పుంగనూరు కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇట్టా శ్రీధర్, ఉపాధ్యక్షులు అమరనాథ్, ఈ.సి. మెంబర్లు తీర్థనంద రెడ్డి, అమరనాథ్ రెడ్డి, పట్టణం లోని మెడికల్ షాప్ యజమానులు, కెమిస్ట్ లు సురేష్ బాబు, షరీఫ్ , చంద్ర, శ్రీనివాసులు, అమల, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News