నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 ః తంబళ్లపల్లె మండలంలో స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి మద్దిలేటి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శిలు, గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంవి ప్రసాద్ పంచాయతీలలో పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణలో అప్రమత్తంగా ఉండి ప్రజల నుండి ఐ వి ఆర్ కాల్ లో ఒకటి నొక్కేలా పనిచేయాలని సూచించారు. గ్రామాలలో పారిశుధ్యంతోపాటు ఆరోగ్యపరమైన సమస్యలపై వైద్య సిబ్బందితో పాటు ఆశ వర్కర్లు తమ వంతు బాధ్యత వహించేలా కార్యదర్శులు శ్రద్ధచూపాలన్నారు. కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి పారిశుధ్యం పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్ లు పాల్గొన్నారు
Reporter
Namitha News