నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 31 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని వైకాపా నాయకులు, కార్యకర్తలు నా కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడిన వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఆదివారం ఆయన తంబళ్లపల్లె ఆయన మండలంలోని జుంజురపెంట పంచాయితీ బురుజు పల్లి కు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు మల్లికార్జున రాయల్ కుమారుడు తన్విష్ ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి తిరుపతి నారాయణాద్రి హాస్పిటల్ లో కాలుకు శస్త్ర చికిత్స చేయించి తంబళ్లపల్లె కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఉదయం మల్లికార్జున ఇంటికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన తన్విష్ ను పరామర్శించి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన తన స్వగృహంలో మండలంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలతో మండలంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. మండలంలో వైకాపా నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గతంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, రాష్ట్ర వైకాపా యువజన జాయింట్ సెక్రెటరీ కిషోర్ కుమార్ రెడ్డి,వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, వైకాపా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు
Reporter
Namitha News