నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : పుంగనూరు - జూలై 16 : గత కొన్ని సంవత్సరాలుగా పుంగనూరు టౌన్లో గల స్క్రాప్ గోడౌన్ మరియు డంపింగ్ యార్డు గురించి ఇదివరకే పుంగనూరు మునిసిపల్ అధికారులకు మరియు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించడం జరిగింది. కాగా గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలు తమ ఇళ్లలో మరియు వీధుల్లో ఉన్న సమస్యలను మరియు స్క్రాప్ డంపింగ్ గోడౌన్ వల్ల కలిగే ఇబ్బందులను జనసేన రాయల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో. జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ పుంగనూరు కమిషనర్ కి సమస్య పై సత్వరమే పరిష్కారం చూపాలని కోరడం జరిగింది. అంతేకాక స్క్రాప్ గోడౌన్ యజమానిని ఒక నెలలోనె ఖాళీ చేయమని, జన నివాస స్థలం లో స్క్రాప్ గోడౌన్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని, దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు అని గుర్తు చేశారు. దీనికి స్క్రాప్ షాప్ యజమాని స్పందిస్తూ తాను ఇచ్చిన గడువులోపే గోడౌన్ను టౌన్ వెలుపలకు మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ లీడర్ నానాబాల లక్ష్మణకుమార్, నానాబాల దినేష్,, నానాబాల ఉదయ్, నానాబాల పరమేషు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News