నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడితే వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవు... ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి అన్నమయ్య జిల్లా,పుంగనూరులోని హోటల్స్, మాంసపు దుకాణాలు, బేకరీలు, స్వీట్ స్టాల్ లను మున్సిపల్ సిబ్బందితో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురులక్ష్మి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ముమ్మారంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా పలు దుకాణాలలో కుళ్ళిన కూరగాయలు, ముడేప్ప సర్కిల్ లోని మటన్ షాప్లో లో నిల్వ ఉంచిన పోటేలు తలకాయ వంటి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ పునరవృతం కాకుండా ఆకస్మిక తనిఖీ లు ఉంటాయని మళ్ళీ ఇదే జరిగితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు తినే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించబోమని హెచ్చరించారు.
Reporter
Namitha News