నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 12 : ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటల దిగుబడి ధాన్యంతో పాటు కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యం పెంపొందుతుందని ఏవో థామస్ రాజా పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ స్టాల్ ను పరిశీలించి నేడు ప్రకృతి వ్యవసాయంతో గుండ్లపల్లి పంచాయతీలో కొందరు రైతులు పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ అవగాహనతో ప్రకృతి వ్యవసాయంతో పలు రకాల పంటలతో పాటు ఆకుకూరలు, కాయగూరల పంటలు పండించి సత్ఫలితాలు సాధించారని అదేవిధంగా మోడల్ స్కూల్లో జిల్లా స్వర్ణ పంచాయితీ, వార్డుల అధికారి అమర్నాథరెడ్డి సూచనలతో ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ సారధ్యంలో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం పంటలు పండించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో రైతులు ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండించి వాటి దిగుబడితో భావితరాల కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆయన కోరారు. ఆయన వెంట జనసేన మండల నాయకుడు నరసింహులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News