నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. సోమవారం తంబళ్లపల్లె లో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాల రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, పరిమితికి మించి ఆటోలలో జనాలను ఎక్కించరాదని, జనసంచారం ఉన్నచోట అతివేగం గా వాహనాలు నడపరాదని, డ్రైవర్లు లైసెన్స్ తో పాటు ఒరిజినల్ రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వాహనాల తనిఖీలో ఎస్సై నజీర్ భాష, జమీల్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News