నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 04 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు స్థానిక టిడిపి నేతలు ఆదిరెడ్డి, శివరాం, ఆనంద నాయుడులు గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సోమవారం డిఎల్పిఓ నాగరాజు నిధుల దుర్వినియోగంపై విచారణకు హాజరయ్యారు. పంచాయతీలో చేయని పనులకు బిల్లులు చేసుకున్నారని ఇంకా పలు ఆరోపణలు టిడిపి నాయకులు డిఎల్పిఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఎల్పీ ఓ నాగరాజు సంబంధిత కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరారు. గతంలో పంచాయతీ నిధులు ఏఏ పనులకు చేసిన కేటాయింపులు, జరిగిన పనుల వివరాలు, విడుదల చేసిన నిధులు రికార్డులతో సహా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యదర్శి శ్రీనివాసరావు వివరణ ఇస్తూ చేసిన పనులకు రికార్డులు సక్రమంగా ఉన్నాయని రికార్డులు ఈనెల 11వ తేదీ అప్పజెప్తానని లిఖితపూర్వకంగా డిఎల్పిఓ కు అందజేశారు
Reporter
Namitha News