నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 : తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి ప్రధాన రహదారులు గత కొంతకాలంగా రోడ్లు గుంతల మయమై పలు ప్రమాదాలు జరిగి వాహన చోదకులు ఆసుపత్రి పాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై పలుమార్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ విషయమై గతశివరాత్రి ఉన్నతాధికారులు స్పందించడంతో ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారు. తంబళ్లపల్లె నుండి మొలకలచెరువు, మదనపల్లి, పెద్దమండెం రహదారులతో పాటు మల్లయ్య కొండ కింద వరకు గుంతల మయమైన రోడ్లలో తారు ప్యాచింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Reporter
Namitha News