Monday, 27 July 2026 01:55:51 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె లో భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు

భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు

Date : 15 November 2025 05:51 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా జోనల్ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్ అధ్యక్షతన భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలను శనివారం మదనపల్లె ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి ముండా (1875–1900) బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గౌరవనీయమైన ఆదివాసీ నేత మరియు స్వాతంత్ర్య సమరయోధుడని మరియు ఆదివాసీ హక్కులు, స్వయం పాలన కోసం చేసిన ఆయన పోరాటం, స్థానిక గిరిజన సమాజాలకు ప్రతిఘటన మరియు శక్తివంతతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు.ఆయన స్మరణార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 15న భారత్‌వ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటున్నారు. 2024 నవంబర్ 15న, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్‌లోని జమూయి జిల్లాలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఒక స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఆయన భారతీయ ఆదివాసీ వారసత్వం మరియు స్వాతంత్ర్య పోరాటానికి చేసిన సేవలను ప్రముఖంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం పాటు జరుపుకునే కార్యక్రమాలు 2025 నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయని వారి సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నారద రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, సామాజిక సేవకురాలు పీట్ల అంజలి డేరంగుల రమేష్ రాజు,రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :