నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో గుండ్లపల్లి ఏటిగడ్డ సదాశివుని ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా గుండ్లపల్లి సదాశివుని ఆలయంలో స్వామివారికి నెల రోజులుగా శివమాల భక్తులు పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారిని చాందిని బండి లో అలంకరించి గ్రామంలో ఊరేగింపులో సర్పంచ్ మౌలాలి తోబాటు హరినాథరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని అన్ని గ్రామాలలో ఊరేగింపు లో చెక్క భజనలు, మహిళల కోలాటాలు, బాణసంచా, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జనాలను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీలోని గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News