నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -మే 06 : మండలంలోని కోసువారి పల్లి పంచాయతీ వడ్డిపల్లి కు చెందిన టిడిపి నాయకుడు లక్ష్మన్న కుమార్తె నారాయణమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్థానిక టిడిపి నేతలు తీవ్రంగా స్పందించి ఆర్థికంగా చేయూతనందించారు. టిడిపి నాయకుడు సీడ్ మల్లికార్జున నాయుడు రూ5000, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ రూ 2000, కన్నె మడుగు రేపన బాబు రూ 2000, మరియు చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, ఆనంద నాయుడు, ఉప్పుతోళ్ల శివరాం, రవి, కృష్ణమూర్తిలు రూ 6000 మొత్తం రూ 15000 ఆర్థిక సాయం అందించి ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి నాయకులు చేసిన ఆర్థిక వితరణ పై లక్ష్మన్న తో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News