నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 24 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం లో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్ ఏపీవో అంజనప్ప ఆధ్వర్యంలో అధికారులు పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 26 తేదీన ఎక్కడ చెత్త కనపడరాదని సూచించిన విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పారిశుధ్య పనులు మొక్కుబడిగా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి,ఏఈఓ సురేష్, పద్మావతి, ఉపాధి హామీ, ఐకెపి మహిళలు సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News