నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 10 : తంబళ్లపల్లె మండలం లో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది స్వామిత్ర సర్వేపై దృష్టి సారించాలని నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సచివాలయ సిబ్బంది తో జరిగిన సమీక్షలో స్వామి త్ర సర్వే త్వరగా పూర్తి చేయాలని పంచాయతీల ఆర్థిక లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్లోనే జరగాలని ఆదేశించారు. పంచాయతీల ఆదాయ వనరులు పెంపుతో పాటు పన్ను వసూళ్లు, గ్రామాలలోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె సిద్ధారెడ్డి గారి పల్లెలో స్వామిత్ర సర్వే కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో పట్నాయక్, డిప్యూటీ ఎంపీడీవో మారుతీకుమార్, కార్యదర్శులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News