నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధి ,అత్యున్నత స్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేద్దాం- APIIC DIRECTOR, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ నేడు ఆయన క్యాంప్ ఆఫీసులో ఏపీఐఐసి కడప అన్నమయ్య జిల్లాల రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి మరియు డిఈ కమలాకర్ గారితో మదనపల్లి జిల్లా పారిశ్రామిక వాడల్లో ఉన్న సమస్యలు కల్పించాల్సిన మౌలిక వసతులు ముఖ్యంగా మదనపల్లి తంబాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి MSME పార్కులు మరియు పీలేరు నియోజకవర్గంలో కల్పించవలసినటువంటి మౌలిక సదుపాయాలు గురించి అలాగే ములకలదిన్నె ఆటోనగర్ మరియు వలసపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జరుగుతున్న రోడ్లు డ్రైనేజీ సిస్టం వర్కుల గురించి చర్చించారు ఈ నెల 29వ తేదీన జరుగునున్న ఏపీఐఐసి 250వ బోర్డు మీటింగ్లో ప్రస్తావించాల్సిన విషయాలు గురించి చర్చించారు ఆటోనగర్ కు సంబంధించి ప్లాట్లను అర్హులకు త్వరగా కేటాయించాలని అలాగే తంబాలపల్లి మదనపల్లి ఏర్పాటు చేయబోతున్న MSME పార్కులు ల్యాండ్ ఎక్కువైజేషన్ కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో ప్రారంభించి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని అలాగే మదనపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ NDA కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇండస్ట్రియల్ పాలసీ గురించి విరివిగా అవగాహన సదస్సులు నిర్వహించి మదనపల్లి జిల్లాను ఇండస్ట్రియల్ హబుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News