నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : కడప - జనవరి 08 : అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో జనవరి 17వ తేదీ న జరుగు ముస్లిం క్రిస్టియన్ల సామాజిక సదస్సును జయప్రదం చేయాలని నేడు మర్యాదపూర్వకంగా రాయలసీమ డయాసిస్ బిషప్ గారిని కడపలో తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా శ్రీ చందు కలిశారు. బిషప్ గారికి దుశాలవతో సన్మానం చేసి రాష్ట్రంలో క్రిస్టియన్ల పై జరుగుతున్న దాడుల పట్ల, దేశ రాష్ట్ర చట్టాల పట్ల చర్చించి ఒక నిర్దిష్టమైన చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలని, అందుకు అనుగుణంగా మన క్రిస్టియన్ సమాజాన్ని చైతన్యపరిచి జాగృతి చేయాలని వీరు తెలియజేశారు. మదనపల్లి లో జరుగు ముస్లిం క్రిస్టియన్ల సామాజిక సదస్సులకు పాల్గొనడానికి అన్ని రకాల అనుకూలతను చూపారని తప్పకుండా బిషప్ గారు కార్యక్రమానికి హాజరు కాగలరని తెలియజేశారు. అనంతరం సిఎస్ఐ అడ్మినిస్ట్రేటివ్ నాయకులు ప్రశాంత్ గారు పోస్టర్లు ఆవిష్కరించి రాయలసీమ ప్రాంతంలోని క్రైస్తవ సమాజం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుధీర్, జాకబ్, మెహబూబ్ భాను ప్రకాష్ కుప్పం శివ కుమారులు పాల్గొన్నారు.
Admin
Namitha News