నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తుంబళ్లపల్లె - మే 18 : తంబళ్లపల్లె మండల విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ గా కే సందీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయమై ఉదయం ఎఈ సురేంద్ర కు నియామక పత్రం అందజేశారు. ఏఈ స్వాగతిస్తూ మండలంలో రైతులు, వినియోగదారుల సమస్యల పరిష్కారం, విద్యుత్ బిల్లులు వసూళ్ళ దృష్టి సారించి విద్యుత్ శాఖ సిబ్బంది సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సబ్ ఇంజనీర్ కు సూచించారు. సబ్ ఇంజనీర్ సందీప్ ను లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్ విద్యుత్ సిబ్బంది ఏఎల్ఎంలు ఆమీన్, శేషు, జనార్ధన్ షిఫ్ట్ ఆపరేటర్లు ప్రసాద్, సురేంద్ర, రాజశేఖర్, అనంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, అహ్మద్ విద్యుత్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి ఘన స్వాగతం పలికారు.ఎఈతో పాటు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరి సహకారంతో మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు
Reporter
Namitha News