Sunday, 26 July 2026 10:01:19 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పట్టణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

Date : 08 May 2026 08:53 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : మదనపల్లి పట్టణంలో త్రాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ కూడళ్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ప్రాపర్టీ టాక్స్ మరియు వాటర్ టాక్స్ వసూళ్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మదనపల్లి పట్టణ ప్రత్యేక అధికారి మరియు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ప్రస్తుత జనాభా, త్రాగునీటి అవసరాలు, పనిచేస్తున్న బోర్‌వెల్లు, చేతిపంపులు, నీటి ట్యాంకుల వివరాలు, వేసవికాలంలో త్రాగునీటి సమస్యల నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామారావు కాలనీ, రెడ్డీస్ కాలనీ, మారుతి నగర్, వీక్లీ మార్కెట్ ప్రాంతాల్లో 14 బోర్లు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా 7 కొత్త బోర్లు తవ్వి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు. అదనంగా మరికొన్ని బోర్ల కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు నీటి నాణ్యత పరీక్షలను తరచూ నిర్వహించి ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు విధుల్లో హాజరయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్లు, కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విధులకు అనధికారికంగా గైర్హాజరయ్యే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మున్సిపల్ పార్కులు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి బకాయిల వివరాలు తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, పారదర్శకంగా పన్నుల వసూళ్లు చేపట్టాలని సూచించారు. టాక్స్ చెల్లింపుల ద్వారా రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సేవలు మెరుగుపడతాయని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి వార్డు వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇంజనీరింగ్ డి ఈ శ్రావణి, పబ్లిక్ హెల్త్, ప్రాపర్టీ టాక్స్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :