Sunday, 26 July 2026 10:06:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పండగ వాతావరణం లా పింఛన్లు పంపిణీ

గంగిరెడ్డిపల్లి యువ నాయకుడు భాస్కర నాయుడు ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ

Date : 31 December 2025 09:51 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం ఒకరోజు ముందుగానే పండగ వాతావరణంలా పంపిణీ చేయడం, లబ్ధిదారుల కళ్ళల్లో అంతులేని ఆనందం చూడటం, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తంబళ్లపల్లి మండలం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలుగుదేశం సీనియర్ నాయకులు భాస్కన్నాడు చంద్రమోహన్ నాయుడు , శ్రీనివాసులు నాయుడు ఉదయం ఆరు గంటల నుండి సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బంది తోపాటు "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. రేపు ఒకటవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒకరోజు ముందే లబ్ధిదారులకు కానుకగా పించను అందజేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం, వృద్ధులు, వితంతువులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈరోజు సాయంత్రం లోగా లబ్ధిదారులకు పింఛను పంపిణీ పూర్తిచేయాలని అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీ పూర్తిగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అనుబంధ సంఘాలు, మహిళలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :