నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం ఒకరోజు ముందుగానే పండగ వాతావరణంలా పంపిణీ చేయడం, లబ్ధిదారుల కళ్ళల్లో అంతులేని ఆనందం చూడటం, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తంబళ్లపల్లి మండలం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలుగుదేశం సీనియర్ నాయకులు భాస్కన్నాడు చంద్రమోహన్ నాయుడు , శ్రీనివాసులు నాయుడు ఉదయం ఆరు గంటల నుండి సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బంది తోపాటు "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. రేపు ఒకటవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒకరోజు ముందే లబ్ధిదారులకు కానుకగా పించను అందజేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం, వృద్ధులు, వితంతువులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈరోజు సాయంత్రం లోగా లబ్ధిదారులకు పింఛను పంపిణీ పూర్తిచేయాలని అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీ పూర్తిగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అనుబంధ సంఘాలు, మహిళలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News