Monday, 27 July 2026 11:49:19 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ యంగ్ మైండ్స్ పై అవగాహన

ముఖ్య అతిధిగా హైదరాబాద్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి చిట్టెడి

Date : 11 December 2025 06:31 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 11 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు ఎంట్రప్రెన్యూర్ షిప్ ఇన్ ఇండియా ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ యంగ్ మైండ్స్ అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ యూనివర్సిటీ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం నందు అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ క్రిష్ణారెడ్డి చిట్టెడి పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ఉన్న మెళకువలను మరియు ప్రాముఖ్యతను వివరించారు. టెక్నాలజీ పురోగతి, డిజిటల్ సేవలు, ఈ-కామర్స్, ఫిన్‌టెక్, కృత్రిమ మేధస్సు , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు విస్తృత అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు . భారతదేశంలో యువ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్న అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఉన్న వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక పధకాలు, డిజిటల్ యుగంలో వచ్చే కొత్త వ్యాపార మార్గాలు గురించి సమగ్రంగా వివరించారు. అలాగే యువత ఎదుర్కొనే సవాళ్లు, మార్కెట్ పోటీ, ఆర్థిక వనరుల సమీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నాయని, వాటిని విద్యార్థులు ఏవిధంగా అందిపుచ్చుకోవాలో తెలియజేశారు. ఇప్పటికే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉన్న NBMSME , KVIC , NSIC , NSIEDB వంటి పథకాల గురుంచి తెలియజేశారు. విద్యార్థులకు ఎన్నో ఆలోచనలు ఉంటాయని, ఆ ఆలోచనల నుండి వాస్తవికతకి ఎలా తీసుకెళ్లాలో ముందుగా తెలుసుకోవాలని ఆయన అన్నారు. దేశం ప్రగతి పధంలో ముందుకెళ్లాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ , ప్రొఫెసర్ అండ్ డీన్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి , కో ఆర్డినేటర్ కె ఎలియ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: