నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 11 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు ఎంట్రప్రెన్యూర్ షిప్ ఇన్ ఇండియా ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ యంగ్ మైండ్స్ అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ యూనివర్సిటీ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం నందు అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ క్రిష్ణారెడ్డి చిట్టెడి పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ఉన్న మెళకువలను మరియు ప్రాముఖ్యతను వివరించారు. టెక్నాలజీ పురోగతి, డిజిటల్ సేవలు, ఈ-కామర్స్, ఫిన్టెక్, కృత్రిమ మేధస్సు , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు విస్తృత అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు . భారతదేశంలో యువ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్న అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్లో ఉన్న వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక పధకాలు, డిజిటల్ యుగంలో వచ్చే కొత్త వ్యాపార మార్గాలు గురించి సమగ్రంగా వివరించారు. అలాగే యువత ఎదుర్కొనే సవాళ్లు, మార్కెట్ పోటీ, ఆర్థిక వనరుల సమీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నాయని, వాటిని విద్యార్థులు ఏవిధంగా అందిపుచ్చుకోవాలో తెలియజేశారు. ఇప్పటికే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉన్న NBMSME , KVIC , NSIC , NSIEDB వంటి పథకాల గురుంచి తెలియజేశారు. విద్యార్థులకు ఎన్నో ఆలోచనలు ఉంటాయని, ఆ ఆలోచనల నుండి వాస్తవికతకి ఎలా తీసుకెళ్లాలో ముందుగా తెలుసుకోవాలని ఆయన అన్నారు. దేశం ప్రగతి పధంలో ముందుకెళ్లాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ , ప్రొఫెసర్ అండ్ డీన్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి , కో ఆర్డినేటర్ కె ఎలియ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News