నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 19 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బి.టెక్ మూడవ సంవత్సరము చదువుతున్న 33 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చొరవతో ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్ ఎస్.టి.ఈ.ఏం. (STEM) స్టార్స్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ కింద స్కాలర్ షిప్లు లభించాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ డాక్టర్ యువరాజ్ అన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం లభించింది అని, ఇది మొత్తం రూ. 33,00,000/- గ్రాంట్ లభించిందని ఆయన అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ మద్దతు ఇస్తున్న ఇన్ఫోసిస్ వారికి ఈ సందర్బంగా కృతఙతలు తెలియజేసారు. స్కాలర్షిప్ లభించిన విద్యార్థులను ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకనాథ్, వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ యువరాజ్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫ్ఫాయిర్స్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేసారు
Admin
Namitha News