నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే కలిసి ఆర్టీసీ బస్టాండ్ చివరిలో మాకు కొంచెం స్థలం కావాలి ఆటోలు పెట్టుకోవడానికి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కోరారు. మదనపల్లి బస్ స్టాండ్ కు వచ్చి క్షేత్ర స్థాయి లో పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా కల్పించిన ఎమ్మెల్యే , ప్రజాదర్బార్ ముగిసిన వెంటనే బస్ స్టాండ్ కు చేరుకొని, డిపో మేనేజర్ తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ను క్షేత్ర స్థాయి లో సందర్శించి, ఆటో వాళ్ళ కు రెండు ఆటోలు పెట్టుకోవడానికి కొంచెం స్థలం కేటాయించిన గలరని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. తమ సమస్యలపై వెనువెంటనే స్పందించిన ఆటో వాలాలు ఎమ్మెల్యే షాజహాన్ బాష ను అక్కడే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Admin
Namitha News