నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అర్ధ రాత్రి అగ్నిప్రమాదం మూడు దుకాణాలు మంటలకు ఆహుతి రూ.5 లక్షల ఆస్తి నష్టం విశాలాంధ్ర, మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించే మూడు దుకాణాల్లో శుక్రవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది అని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి బాధితులు బావజాన్, సౌకత్ తెలిపిన వివరాల మేరకు దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి శివప్ప సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటల్లో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. దాదాపు 70 ఏళ్లుగా నిర్వహిస్తున్న తమ దుకాణాలు దెబ్బతినడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Reporter
Namitha News