నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి - 14వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయం మదనపల్లె : పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పిలుపునిచ్చారు.14వ వార్డులో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ చిన్నారుల నిండైన జీవితానికి ఏడాదిలో రెండు పర్యాయాలు పోలియో చుక్కలు వేయించాలన్నారు.సమాజంలో పోలియోను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు.పోలియో వ్యాధిని సమూలంగా అరికట్టడమే పల్స్ పోలియో లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.14వ వార్డు పరిధిలోని 0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు.ఎవరైనా వేసుకోని పక్షంలో సోమ,మంగళవారంలో ఆయా సచివాలయాల పరిధిలో పోలియో చుక్కలు వేయించుకునే వెసులుబాటు ఉందన్నారు.ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా నియోజకవర్గంలో వైద్యం,విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.సమర్ధవంతమైన పాలనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ టిడిపి మహిళా లీడర్ నజ్మా సుల్తానా నాయకులు అంగడి కుమార్,వసంత ప్రసాద్,వాసు,ధరణీష్,దిలీప్,కార్తీక్,శివ,యశ్వంత్,ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News