నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 16 : తంబళ్లపల్లె తహసీల్దార్ కార్యాలయం ఏడాదిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయమై వార్త దినపత్రికలలో తహసీల్దార్ కార్యాలయానికి గ్రహణం వీడేనా కథనంపై మంగళవారం స్థానిక టిడిపి నేతలు పీకేఎం యు డి ఎ చైర్మన్ సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పురాతన కార్యాలయాన్ని స్వయంగా సందర్శించి కార్యాలయం దుస్థితిపై స్పందించి నూతన కార్యాలయం నిర్మాణానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక నేతలు శివపురం రోడ్డు, పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం, పెండింగ్ లోని సచివాలయాల నిర్మాణాలు,ఇంకా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి పరిష్కార హామీ ఇచ్చారు. ఆయన హామీతో టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News