నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికైన సందర్భంగా శనివారం సాయంత్రం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్న (తారక్) చిన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దేవేంద్రబాబును శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, డిపో అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి దేవేంద్రబాబు నాయకత్వం మరింత బలంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రవి, ట్రాన్స్కో గురు భాస్కర్, స్టూడియో శీన, రామపురం శీనా, మురళి, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
Reporter
Namitha News