Sunday, 26 July 2026 10:36:41 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్

బిసివై అధినేత రామచంద్ర యాదవ్ ను, బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ల ఆత్మీయ కలయిక

Date : 11 June 2026 11:08 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 11: వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాధికారత, రాజ్యాధికారం కోసం బిసి సంఘాల ఐక్యత ఎంతో అవసరం అని బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్, బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‌శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు బిసి హక్కుల పోరాట సమితి నాయకులు సాదర స్వాగతం పలికి దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ‌ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు చర్చించి, పలు విషయాలను పంచుకున్నారు. బిసిలు అందరూ తమ విభేదాలను పక్కన పెట్టి, ఒకే వేదికపైకి రావడం ద్వారా మాత్రమే చట్టసభల్లో సముచిత స్థానం, ఆర్థికాభివృద్ధి, రిజర్వేషన్ల ఫలాలు పూర్తి స్థాయిలో అందుకోగలరని అభిలాషించారు. బీసీ ఐక్యత రాజ్యాధికార సాధన, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే అన్ని కులాల విభేదాల వీడి ఐక్యతగా వుండాలని అన్నారు. బిసిల పేరు చెప్పుకునే అధి నాయకులు స్వప్రయోజనాలు పక్కనపెట్టి, సామాజిక న్యాయం కోసం కులాలకతీతంగా కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ‌ బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత లభించినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పుంగనూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిసి హక్కుల పోరాట సమితి నాయకులు రామలింగ, రామాంజులు, చిన్న రెడ్డెప్ప, సుబ్బారాజు, సిద్దయ్య, మోహన్, శ్రీనివాసులు, చంద్రయ్య, జయన్న, గంగిరెడ్డి, మోహన్ యాదవ్, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్, కుమార్ తదితరులు బోడే రామచంద్ర యాదవ్ ను కలవడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :