Sunday, 26 July 2026 12:23:38 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె కోర్టు హాజరైన జోగి రమేష్ బ్రదర్స్ పరామర్శించిన జోగి కుమారుడు మరియు స్థానిక ఎమ్మెల్యే పరామర్శ.

Date : 05 January 2026 08:12 AM Views : 592

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 4 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామును ఆదివారం రాత్రి 9:45 గంటలకు తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో ఎక్సైజ్ పోలీసులు హాజరు పరిచారు. గత మూడు రోజుల క్రితం నెల్లూరు జైలు నుండి విచారణ నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. కస్టడీ పూర్తవడంతో ఆదివారం విజయవాడ నుండి తంబళ్లపల్లె కోర్టులో న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ ముందు హాజరు పరిచారు. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ లు కోర్టు ప్రాంగణంలో పరామర్శించారు. మాజీమంత్రి జోగి రమేష్ రాక తెలుసుకున్న వైకాపా నాయకులు మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే ద్వారక నాధరెడ్డి స్వగృహం వద్ద మఖాం వేశారు. తంబళ్లపల్లె, ములకలచెరువు ఎస్ఐలు టి అనిల్ కుమార్, ప్రతాప్ ల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జోగి రమేష్ ను తీసుకొస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వందలాదిగా వైకాపా నాయకులు అడ్డుకొని జై జగన్ నినాదాలతో జయ జయ ద్వానాలు చేశారు. పోలీసులు వైకాపా నాయకులు , కార్యకర్తలను నిలువరించి జోగి రమేష్ వాహనాన్ని కోర్టు లోపలికి పంపించారు. కోర్టులో న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ నిందితులకు తొమ్మిది రోజులు రిమాండ్ విధించడంతో వారిని ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి స్పెషల్ సబ్ జైలుకు తరలించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :