నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 4 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామును ఆదివారం రాత్రి 9:45 గంటలకు తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో ఎక్సైజ్ పోలీసులు హాజరు పరిచారు. గత మూడు రోజుల క్రితం నెల్లూరు జైలు నుండి విచారణ నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. కస్టడీ పూర్తవడంతో ఆదివారం విజయవాడ నుండి తంబళ్లపల్లె కోర్టులో న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ ముందు హాజరు పరిచారు. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ లు కోర్టు ప్రాంగణంలో పరామర్శించారు. మాజీమంత్రి జోగి రమేష్ రాక తెలుసుకున్న వైకాపా నాయకులు మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే ద్వారక నాధరెడ్డి స్వగృహం వద్ద మఖాం వేశారు. తంబళ్లపల్లె, ములకలచెరువు ఎస్ఐలు టి అనిల్ కుమార్, ప్రతాప్ ల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జోగి రమేష్ ను తీసుకొస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వందలాదిగా వైకాపా నాయకులు అడ్డుకొని జై జగన్ నినాదాలతో జయ జయ ద్వానాలు చేశారు. పోలీసులు వైకాపా నాయకులు , కార్యకర్తలను నిలువరించి జోగి రమేష్ వాహనాన్ని కోర్టు లోపలికి పంపించారు. కోర్టులో న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ నిందితులకు తొమ్మిది రోజులు రిమాండ్ విధించడంతో వారిని ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి స్పెషల్ సబ్ జైలుకు తరలించారు
Reporter
Namitha News