Sunday, 26 July 2026 12:26:42 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి

Date : 18 November 2025 05:02 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి - దుశ్చర్యకు ఒడిగట్టిన కొందరు స్థానికులు మదనపల్లె : గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యల నడుమ స్థానికంగా ఉన్న కొందరు మదనపల్లె మండలం,వేంపల్లె పంచాయతి,ఎగువకొనకుంట్ల వారిపల్లె గ్రామానికి దారి లేకుండా 20 రోజులుగా రోడ్డుకు అడ్డంగా మట్టితోలి దారిని పూర్తిగా మూసేశారు.దీంతో గ్రామంలోని 29 కుటుంబాలు ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా,విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా,రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలన్నా,వ్యవసాయ పొలాల నుంచి ధాన్యం,గడ్డి,వ్యవసాయ పనిముట్లు,తదితర వస్తువులు ఇళ్లకు,పొలాలకు తరలించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దారిని తెరవాలని అడిగితే స్థానికంగా గొడవలకు దిగి,దుర్భాషలాడుతూ,ఘర్షణలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.వారిని ఎదిరించే శక్తి మాకు లేదని అధికారులకు,పోలీసులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిని మూసేసిన వారిపై చర్యలు తీసుకొని వెంటనే దారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.ఈ విషయమై తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని వివరణ కోరగా పంచాయతీ సెక్రటరీ,వీఆర్వోలను సంఘటనా స్థలానికి పరిశీలనకై పంపామని,అయినా వారు దారికి అడ్డుగా వేసిన మట్టిని‌ తొలగించలేదన్నారు.కాబట్టి వారిపై కేసు నమోదు చేయమని తాలూకా పోలీసులను కోరడం జరిగిందన్నారు.‌మూసేసిన దారిని వెంటనే తెరవకపోతే కఠిన‌ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :