నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 10 : స్వాతంత్ర సమరయోధుడు రేనాటి ముద్దుబిడ్డ తెల్ల దొరల పాలన పై అలుపెరగని పోరాటం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న వడ్డెర జాతికే మణిరత్నంగా నిలిచాడని తంబళ్లపల్లె మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు రేపన మల్లికార్జున కొనియాడారు. శనివారం వడ్డెర సంఘ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలనాటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించడం హర్షనీయమన్నారు. 11వ తేదీ ఆదివారం ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్క వడ్డెర కులస్తుడు కలిసి రావాలన్నారు. ఓబన్న స్ఫూర్తితో వడ్డెర జాతిని ఎస్టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పూజారి వెంకటరమణ, మహిళా నాయకురాలు రామలక్ష్మి, తేపల్లె రెడ్డప్ప, తేపల్లె నరసింహులు, నాగరాజు, నడిపన్న, శివశంకర, రమణ, మల్లప్ప, అరుణ, సిద్ధమల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News