నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 12 : ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు లో 29 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సైడ్ కాలువల నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సురా.భాస్కర్ రెడ్డి హాజరైన అతిధులను ఘనంగా సత్కరించారు.. కాలువల నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణకార్యక్రమం ప్రారంభించారు... ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పులిమి శైలజ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ కాలువ నిర్మాణానికి మంత్రివర్యులు ఆనంద్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు
Admin
Namitha News